దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఇంట్లోనే గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న‘ఫైటర్’ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ఇంట్లో నుంచే తన కొత్త చిత్రానికి సంబంధించిన స్కిప్ట్ రెడీ చేస్తున్నారు. కథకు తగ్గట్టుగా సన్నివేశాలను రాసుకుంటూ స్క్రిప్టును తన ఫోన్లే సేవ్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పూరీ జగన్నాథ్నే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. స్కిప్ట్ కోసం చేస్తున్న వర్కౌట్ను ఫొటో తీసి షేర్ చేశారు. అయితే ఈ చిత్రంలోని హీరో, హీరోయిన్లకు సంబంధించిన వివరాలను మాత్రం బయటకు చెప్పలేదు. పూరీ అదిరిపోయే కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ హీరో విషయంలో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. చిరంజీవికి కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈసారి పూరీ, చిరును ఒప్పిస్తే మాత్రం టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉన్నట్లే.