వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగు సీజన్-3… నాగార్జున హోస్ట్గా 15మంది సెలబ్రిటీలతో జూన్ 21న మొదలైన ఈ కార్యక్రమం విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే గతంలోలా కాకుండా ఈ సారి బిగ్ బాస్ టీం ఇచ్చే సర్ప్రైజ్ ఆడియన్స్లో కార్యక్రమంపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. బిగ్ బాస్.. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. ఎవ్వరి మాటా వినడు. ఆయన చెప్పిందే శాసనం… సరికొత్త ట్విస్టులతో సాగిపోతుంది బిగ్ బాస్ సీజన్ 3. ముందుగా సైక్లింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఒకటి కరెంట్ కోసం.. మరోటి గ్యాస్.. ఇంకోటి నీటి కోసం ఈ సైక్లింగ్ పోటీ పెట్టాడు బిగ్ బాస్. అక్కడ తొక్కితేనే ఇక్కడ ఇవన్నీ వస్తాయి లేదంటే లేదు. అది నడుస్తుండగానే ఇప్పుడు మరో టాస్క్ ఇచ్చాడు శ్రీముఖికి. తాజాగా విడుదలైన ప్రోమోలో మరో ఆసక్తికరమైన విజువల్ వచ్చింది. ఈ సారి శ్రీముఖిని టార్గెట్ చేసాడు బిగ్ బాస్. ఆమెతో పాటు అలీ రెజా కూడా బుక్ అయ్యాడు. ఈ ఇద్దర్నీ ఏకంగా 100 పిడకలు కొట్టాలంటూ ఆదేశించాడు. ఈమె 100 పిడకలు కొట్టాలని చెప్పేసరికి షాక్ అయిపోయింది. అయినా తప్పదు కదా.. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు ఇవన్నీ కామన్. పైగా నామినేషన్స్లో కూడా టాప్లో ఉంది శ్రీముఖి. ఆమెను వీలైనంత త్వరగా పంపేయాలని డిసైడ్ అయిపోయారు ఇంటి సభ్యులు. ఆమెకు తెలియకుండానే శ్రీముఖిపై చాలా కుట్రలు చేస్తున్నారు అక్కడ. మరి చూడాలి శ్రీముఖి పిడకలు ఎలా చేస్తుందో.
previous post
ఆ హీరో నన్ను వేధించాడు : రెజీనా