telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా కట్టడికి ఎంతో చేస్తున్నారు.. మోదీనీ ప్రశంసించిన ట్రంప్

Indian trade status cancelled by trump

భారత్ లో కరోనా కట్టడికి ఎంతో చేస్తున్నారని ప్రధాని మోదీనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. కొవిడ్-19 పేషంట్లకు చికిత్స చేసేందుకు మలేరియా నిరోధానికి వాడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను మరింత విరివిగా సరఫరా చేయాలని మోదీని ట్రంప్ కోరారు. నేను కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ ను ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నానని, ఈ విషయాన్ని చెప్పడానికి తానేమీ సిగ్గు పడటం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన డాక్టర్లతో మాట్లాడిన తరువాత టాబ్లెట్ వేసుకున్నానని తెలిపారు.

ఈ టాబ్లెట్ల కోసం అమెరికా ఇప్పటికే భారత్ కు ఆర్డర్ ఇచ్చిందని అయితే, ప్రస్తుతం భారత నిషేధం అమలులో ఉన్నందున ఇంకా సరఫరా జరగలేదని తెలిపారు. ఈ విషయంలో తమకు సహకరించాలని కోరానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇండియాలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల నిల్వ చాలా అధికంగా ఉందని అన్నారు.

అక్కడి మెడికల్ షాపుల్లో సైతం ఈ డ్రగ్ విరివిగా లభిస్తోందని అన్నారు. అయితే, కోట్లాది మంది ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాంటీ మలేరియా డ్రగ్ నిల్వలను వ్యూహాత్మకంగా వాడుకోవాలని తాను సూచించానని అన్నారు. యూఎస్ కోరిన విధంగా టాబ్లెట్లను ఎగుమతి చేస్తే, తాను ఎంతో సంతోషిస్తానని మోదీకి తెలియజేసినట్టు పేర్కొన్నారు. కొవిడ్-19పై పోరులో ఇరు దేశాలూ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Related posts