telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని యాగాలు

yagam

ఎన్నికల్లో విజయం కోసం నేతలు ఈ మధ్య యాగాలు చేయడం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నేతలు ఇప్పటికే ఎన్నో యాగాలు చేయగా తాజాగా ఓ ఏపీ ఎంపీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని యాగాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనినరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు ప్రారంభించారు.

మొర్జంపాడు శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువాం శత చండీయాగం, మహాసుదర్శన యాగాలు నిర్వహించారు. చల్లా శ్రీనివాసశర్మ ఆధ్యర్యంలో పదుల సంఖ్యలో రుత్వికులు శాస్త్రోక్తంగా యాగ కృతువు నిర్వహించారు. గురువారం ప్రారంభమైన ఈ యాగం ఐదువ రోజైన పూర్ణాహుతితో సమాప్తి అవుతుందని అర్చకులు చెబుతున్నారు.

Related posts