పోవలవరం రివర్స్ టెండరింగ్ తో అవినీతి బయటపడుతుందని చంద్రబాబుకు భయంపట్టుకుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పై ముందుకెళ్లవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పోలవరం ప్రాజక్టును ఆపేస్తున్నట్టు విపక్షాలు హడావుడి చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
యధావిధిగా రివర్స్ టెండరింగ్ కు వెళ్లొచ్చని అన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక వరద ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి వివరించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం లేదని మంత్రి వెల్లడించారు.