ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంట రుణాల మాఫీపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. రైతు బీమా 59 ఏళ్ల లోపు వారికి మాత్రమే వర్తింపుచేస్తున్నారని.. ఆత్మహత్య చేసుకున్న రైతుకు 6 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఉత్తర్వులు అమలు చేయడం లేదని మండిపడ్డారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఆరువేల మంది రైతులు అప్పులు బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.రైతు బంధును నిర్వీరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఎకరాల లోపు ఉన్నవారికే రైతు బంధు ఇస్తున్నారన్నారు. వడ్డీ రాయితీ కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన రాయితీలు నిలిపివేయడం భావ్యం కాదని పేర్కొన్నారు.
ఉత్తమ్ పిచ్చి ప్రేలాపణలు చేయడం మానుకోవాలి: కర్నె ప్రభాకర్