telugu navyamedia
క్రీడలు వార్తలు

టీ20 ఆటగాళ్లకు బీసీసీఐ ఆదేశాలు…

ఇంగ్లాండ్‌తో జరిగే టీ 20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన తరువాత, బీసీసీఐ ఓపెనర్ శిఖర్ ధావన్ వంటి వైట్ బాల్ స్పెషలిస్టులను మార్చి 1న అహ్మదాబాద్‌లో రిపోర్ట్ చేయమని కోరింది. అయితే మార్చి 12 నుండి అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే టీ 20 సిరీస్ కోసం బీసీసీఐ మొత్తం 19 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. అందులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మరియు రాహుల్ తివాటియా వంటి ఆటగాళ్లు ఇండియా జట్టుకు తొలిసారిపిలుపు అందుకున్నారు. అయితే ప్రస్తుతం వీరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. “మార్చి 1న శిఖర్ అహ్మదాబాద్లో ఇతరులతో కలిసి రిపోర్ట్ చేయవలసి ఉంది. మనకు తెలిసినంతవరకు, వైట్ బాల్ స్పెషలిస్టులందరూ రెండు మూడు ప్రాక్టీస్ మ్యాచ్ లు కావాలని కోరారు” అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఈ టీ 20 సిరీస్ మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పూణేలో మార్చి 23 నుంచి 28 మధ్య జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతుండగా.. అందులో మూడో మ్యాచ్ ఈ నెల 24న అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది.

Related posts