అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని సార్సాలాలో అటవీ శాఖాధికారిణి అనిత, సిబ్బందిపై దాడి జరిగిన ఘటన తెలిసిందే. సిర్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ ఈ దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు వస్తున్నాయి.ఈ దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుని పై పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పందిస్తూ, అటవీశాఖాధికారులపై తన తమ్ముడు దౌర్జన్యం చేయలేదని సమర్థించుకున్నారు. ఈ ఘర్షణలో అటవీశాఖాధికారిణికి గాయాలు కావడం బాధాకరమని అన్నారు. అటవీ అధికారులు రాజకీయం చేస్తున్నారని అన్నారు. హరితహారంలో భాగంగా ఇక్కడి భూములను దున్నేందుకు కాంగ్రెస్ నాయకులు ట్రాక్టర్లను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
పార్టీ పిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు