telugu navyamedia
రాజకీయ వార్తలు

బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రాధాన్యం!

Nirmala seetharaman budget

వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా నాణ్యమైన విద్య, ఉత్తమ కోర్సులు అందించాలన్న లక్ష్యం బడ్జెట్‌లో కనిపించింది. విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

2026 నాటికి దేశంలోని 150 విశ్వవిద్యాయాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. అధ్యాపకులు, పారామెడికోల కొరత తీర్చేవిధంగా జాతీయ విద్యావిధానాన్ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి 3వే కోట్ల రూపాయలు కేటాయించారు. డిగ్రీ స్థాయిలో ఆన్‌లైన్‌ విద్యావిధానాన్ని ప్రారంభించి, జాతీయ విద్యా సంస్థల జాబితాలో టాప్‌ 100లో ఉన్న కళాశాలల్లో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Related posts