telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మారిన నిర్ణయం .. ఈ నెల 20న ఏపీ కేబినెట్!

jagan

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 20న నిర్వహించనున్నట్టు మూడు రోజుల క్రితమే మంత్రులకు సమాచారం అందింది. అయితే, శుక్రవారం మధ్యాహ్నానికి తన నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మీటింగ్ ఉంటుందని మంత్రులకు తెలియజేసింది. అయితే, రాత్రి మళ్లీ ఈ నిర్ణయం మారిపోయింది. ముందుగా అనుకున్న ప్రకారమే సోమవారం ఉదయం 9 గంటలకే మీటింగ్ ఉంటుందని మళ్లీ మంత్రులకు సమాచారం అందించింది.

రాజధాని మార్పుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు మంత్రి మండలి ఆమోదిస్తే, దానిని గవర్నర్‌కు పంపి అనుమతి తీసుకుని రెండు గంటల్లోపే అసెంబ్లీ సమావేశాలకు తీసుకురావడంలో హడావుడి ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చించి, మంత్రి మండలిలో ప్రవేశపెట్టడానికి కొంత సమయం తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Related posts