పార్టీ పిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
పిరాయింపులకు పాల్పద్దవారిపై వారిపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలనే విషయం చట్టంలో చెప్పలేదన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలకు నిర్ధిష్ట సమయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులయ్యారని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యసభలో ఇప్పటివరకు 16 దఫాలు విలీనం పేరుతో కలిసిపోయారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.
కుంతియా అనే ఐరన్లెగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం: సర్వే