*వరద ప్రాంతాల్లో చంద్రబాబు బురద రాజకీయాలు..
*పోలవారాన్ని ఏటీఎంలా వాడుకున్నారు..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని రోజా విమర్శించారు.
తిరుమలలో స్వామివారి దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పోలవరా న్ని ఎందుకు పూర్తిచేయలేదని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తామనడం హాస్యాస్పదమన్నారు.
పోలవరం ప్రాజెక్టును తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏటీఎం కార్డులా వాడుకున్నారని రోజా ఘాటు విమర్శలు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు సొంత నియోజకవర్గం కుప్పాన్ని మునిసిపాలిటీ చేసుకోలేని చంద్రబాబు.. ముంపు మండలాలను జిల్లాగా జిల్లాగా చేస్తానని అనడం హాస్యాస్పదమన్నారు చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు కూడా రావని మంత్రి రోజా జోస్యం చెప్పారు.
ప్రజల విశ్వాసాన్ని వైసీపీ పొందలేకపోతుంది: పురందేశ్వరి