telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?: చంద్రబాబు

chandrababu tdp ap

వైసీపీ నేతల ఆదేశాలతో శ్రీకాకుళంలోని పలాసలో ఓ పోలీసు దళిత యువకుడిని తన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అతడి తల్లి అడ్డుకుంటున్నప్పటికీ వదలలేదన్నారు.  వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండాపోతోందని ట్విట్టర్ లో మండిపడ్డారు.

‘వైఎస్ జగన్ గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా? మాస్కు పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేశారు. ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు’ అని లోకేశ్ విమర్శించారు.

‘శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సీఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్లపట్టా అడిగినందుకు పలాస, టెక్కలిపట్నం గ్రామస్థుడు మర్రి జగన్ పై వైకాపా నాయకులు దాడి చేశారు. న్యాయం చెయ్యాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళితే నడి రోడ్డుపై తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదాడు స్థానిక సీఐ’ అని లోకేశ్ మండిపడ్డారు.

Related posts