telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు సెక్యూరిటీ పై స్పందించిన డీజీపీ

apcm jagan give full powers to gowtam as dgp

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఇటీవల పలు ఆరోపణలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది అవాస్తవమన తెలిపారు. శాంతిభద్రతలపై నిష్పాక్షికంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులకు రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు కానుంద ఆదేశాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, ‘వీక్లీ ఆఫ్’ అనేది పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగు అని అన్నారు. సీఎం జగన్ నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఇకపై ఇలాంటివి ఉండవని పేర్కొన్నారు.

Related posts