telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గల్లీ నుండి ఢిల్లీ వరకూ జగన్ పనికిమాలినోడని తేలిపోయింది- నారా లోకేష్‌

ఎంతమంది కలిసినా తన వెెంట్రుక కూడా పీకలేరంటూ సీఎం జగన్ నంద్యాల సభలో చేసిన కామెంట్స్ కి అదేస్థాయిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై కౌంట‌ర్ ఇచ్చాడు.

ఈ సంద‌ర్భంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. విమర్శలు గుప్పించారు.

గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పని చేస్తున్నామ‌ని అన్నారు.

ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం” అంటూ లోకేష్ ఎద్దేవా చేసారు.

నంద్యాల జిల్లాలో జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమ సభలో సీఎం మాట్లాడుతూ… వైసిపి ప్రభుత్వంతో పాటు తనను టార్గెట్ గా చేసుకుని కొందరు ఏకమవుతున్నారంటూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అయితే ఎంతమంది కలిసినా కనీసం తన వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Related posts