telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతలు చెబితేనే కార్యాలయాల్లో పనులు: చంద్రబాబు

chandrababu

ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ నేతలు పనులు చెబితేనే జరిగే పరిస్థితి నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరు ఆక్షేపనీయమన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా ఉండాలన్నారు.

తమ హయాంలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. ఎస్సీలకు అన్యాయం జరిగినట్లు భావిస్తే అందరికీ సమన్యాయం చేయాలని తెలిపారు. జస్టిస్ పున్నయ్య ఆధ్వర్యంలో వాస్తవాల అధ్యయనం జరిగిందన్నారు. సామాజిక న్యాయం కోసం కేటగిరీలు ఉండాలని పేర్కొన్నారు. రిజర్వేషన్ ఫలాలు అందరికి సమానంగా అందాలనే ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించామని చెప్పారు.

Related posts