దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటనలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు జీవితఖైదు పడిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానంలో తీర్పు సందర్భంగా కుల్దీప్ సెంగార్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. తన సోదరి, కుమార్తెతో కలిసి కన్నీరు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ఉన్నావో బాధితురాలి కుటుంబసభ్యులు కోర్టు తీర్పుపై స్పందిస్తూ సెంగార్ కు ఉరిశిక్ష విధించి ఉండాల్సిందని అన్నారు. అప్పుడే తమకు సంపూర్ణ న్యాయం జరిగినట్టు భావించేవాళ్లమని అన్నారు. అతడు జైల్లో ఉన్న సమయంలో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికామని తెలిపారు. అతడు జైల్లోంచి బయటికొస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.