telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగనన్నకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం: వైఎస్‌ షర్మిల

ys sharmila press meet

ఐదేళ్లలో సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల అన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం  గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడుతూ జగనన్నకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.బాబు వస్తే జాబు వస్తుందన్నారని, ఆయన కొడుక్కి మాత్రమే జాబు వచ్చిందని విమర్శించారు. పప్పుకు వర్థంతికి జయంతికి తేడా తెలియదని, ఏ అర్హత ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారని, తర్వాత ప్యాకేజని, ఇప్పుడు హోదా అంటున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోతుందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఎవరితోను పొత్తు అవసరం లేదన్నారు. డ్రాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని, పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసం చేయడానికి బాబు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.

Related posts