మన దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ లు విధిస్తుంటే మరి కొన్ని పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో మరో రాష్ట్రం చేరిపోయింది. తమిళనాడు రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సంపూర్ణంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 10 వ తేదీ నుంచి మే 24 వ తేదీ వరకు మొత్తం 14 రోజులపాటు లాక్డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ అమలులో ఉన్న 14 రోజులు పెళ్లిళ్లు, అంతర్రాష్ట్ర సర్వీసులు, ఉపాదిహామీ పనులు వంటివి ఏమీ ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్నందునే లాక్ డౌన్ విధిస్తున్నామని తమిళనాడు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
previous post
next post