telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత

pothula sunitha mlc

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది. గురువారం ఆ ప్రచారాన్ని సునీత నిజం చేశారు. భర్త సురేశ్‌తో కలిసి వెళ్లి జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఆమె రాజీనామా చేయలేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, అదే సమయంలో రాజధాని కోసం అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం.

Related posts