టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది. గురువారం ఆ ప్రచారాన్ని సునీత నిజం చేశారు. భర్త సురేశ్తో కలిసి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఆమె రాజీనామా చేయలేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, అదే సమయంలో రాజధాని కోసం అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం.