telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విలేకరులపై కక్షసాధింపు చర్యలు.. జగన్ పై చంద్రబాబు ధ్వజం

chandrababu

సీఎం జగన్ నిరంకుశ విధానాలతో రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మీడియాపై నిర్భయ కేసులు బనాయించడం ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. మీడియా స్వేచ్ఛను హరించే నియంతృత్వ వైఖరులను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

తరగతి గదుల్లో పోలీసులు దుస్తులు ఆరేసిన ఘటనను ఫొటోలు తీసినందుకు విలేకరులపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు. తునిలో విలేకరి హత్య జరిగిందని, చీరాలలోనూ ఓ మీడియా ప్రతినిధిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఓ పత్రిక ఎడిటర్ పై దాష్టీకం చెలాయించారని తెలిపారు. ఇలాంటి నియంతలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు.

Related posts