telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో మరో షాక్!

Supreme Court

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో షాక్ తగైలినట్టైంది. ఆంగ్ల బోధనను తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కారు తీసుకొచ్చిన 81, 85 జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియంలో బోధననే కోరుతున్నారని ప్రభుత్వం కోర్ట్ లో వాదించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కేవియట్ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Related posts