తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరుతో వున్న ఫేస్ బుక్ బ్యాన్ అయింది. తమ నిబంధనలను రాజాసింగ్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఖాతాను ఫేస్ బుక్ యాజమాన్యం నిషేధించింది. ఈ వ్యవహారం పై ఫేస్ బుక్ సంస్థ స్పందించింది. ఎవరైనా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తమ నిబంధనలు అనగఈకరించవని స్పష్టం చేసింది.
హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు సంబంధించి తమ నిబంధనలను రాజాసింగ్ ఉల్లంఘించారని చెప్పింది. ఈ కారణం వల్లే రాజాసింగ్ పై నిషేధం విధించామని తెలిపింది. ఈ వ్యవహారంపై రాజాసింగ్ స్పందించారు. తనకు ఫేస్ బుక్ పేజ్ లేదని చెప్పారు. తన పేరు మీద అనేక మంది ఫేస్ బుక్ పేజీని నడుపుతున్నారని చెప్పారు. ఫేస్ బుక్ లో తన పేరు మీద వచ్చే ఏ పోస్టుకూ తాను బాధ్యుడిని కాదని ఇటీవలే ఆయన వివరణ ఇచ్చారు.