భారత్, వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్ నేటి నుండి జరుగుతుంది. ఈ పర్యటనలో కొంతమంది భారత ఆటగాళ్ల ప్రదర్శనను ఆసక్తిగా చూడాలనుకుంటున్నట్లు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. ‘గాయం కారణంగా ప్రపంచకప్ మొత్తానికి దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతని రాక టీమిండియాకు ఎంతగానో కలిసొచ్చే అంశం. పవర్ఫుల్ హిట్టింగ్తో ధావన్ ఎలా జోరు సాగిస్తాడో చూడాలి. ఇక నాలుగో స్థానం విషయానికొస్తే మళ్లీ కేఎల్ రాహులే బరిలోకి దిగితే బాగుంటుంది.
వరల్డ్కప్ ఫామ్ను కేఎల్ ఇక్కడ కూడా కొనసాగిస్తే తిరుగులేనట్లే. మూడు ఫార్మాట్లలోనూ వికెట్కీపర్గా రిషబ్ పంత్ ఈ సిరీస్లో ఎలా ఆకట్టుకుంటాడో ప్రత్యేకంగా చూడాలి’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప అవకాశం. మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్ ఇటీవల సత్తా చాటి మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే తుది జట్టులో వారికి ఎప్పుడు అవకాశం వస్తుందనేది ఆసక్తికరమని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.