telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎన్నికలు జరుగుతున్న విధానం సరిగాలేదు: వెంకయ్య

venkaiah naidu

దేశంలో ఎన్నికలు జరుగుతున్న విధానం సరిగాలేదని, మార్పులు తప్పనిసరి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ‘రాజకీయాల్లో ధన ప్రభావం’ అనే అంశంపై హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఐఎస్ బీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం సాధారణ విషయంలా మారిందని, జనాన్ని తరలించేందుకు ఓ బస్సు, వారిని ఆకర్షించేందుకు బీరు, బిర్యానీ పరిపాటిగా మారాయని అన్నారు. ఈ 3బీ (బీరు, బిర్యానీ, బస్సు) ఫార్ములాకు ప్రజలు దూరంగా ఉండాలని, అప్పుడే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందని అభిలషించారు.

“దేశంలో ఎక్కడో ఒక చోట ఆర్నెల్ల వ్యవధిలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో ఝార్ఖండ్ రాష్ట్రం సిద్ధమైంది. ఆ తర్వాత ఢిల్లీలో ప్రారంబమయ్యాయని, ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు జరపడం వల్ల బీరు, బిర్యానీ, బస్సు ఫార్ములా వాడకం పెరిగిపోయింది.

Related posts