telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బిర్యానీ లో లెగ్ పీస్, మసాలా రాలేదు : కేటీఆర్ ఫిర్యాదు

ktr telangana

ట్విటర్ లో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ప్రజల సమస్యలు ఎలాంటివైన చిటికలో కేటీఆర్ టీం పరిష్కరిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో @askktr పేరుతో ప్రజల సమస్యలను మంత్రి కేటీఆర్ పరిష్కరిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజలకే కాకుండా.. ఇతర రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతోంది. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ చేస్తున్న పనికి ఎంతో మంది నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు ట్విటర్ వేదికగా తోటకూర రఘుపతి అనే వ్యక్తి నుంచి వింత ఫిర్యాదు వచ్చింది. “కేటీఆర్ సారు.. నేను ఆన్లైన్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అయితే ఆ బిర్యానీ లో అదనపు మసాలతో పాటు లెగ్ పీస్ రాలేదు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ప్రజలకు ఇలాగేనా సేవలు అందించడం” అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్మార్ట్ గా కౌంటర్ ఇచ్చారు. “ఈ బిర్యానీ విషయంలో నేనేం చేయగలను బ్రదర్. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు” అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ ట్వీట్ కాస్త బాగా వైరల్ అయింది. దీంతో ఆ నెటిజన్ పై కొందరు సీరియస్ అయ్యారు. కరోనా విలయం కొనసాగుతున్న సమయంలో ఎలాంటి ఫిర్యాదులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఆ ట్వీట్ ను తొలగించారు.

Related posts