నేడు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. ఈ ప్రాజెక్ట్ను జగన్ సందర్శించడం ఇది మూడోసారి. సీఎం హోదాలో తొలిసారిగా ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ పనులను నేరుగా పరిశీలించబోతున్నారు.
తొలుత 2011లో హరితయాత్ర పేరిట తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం వరకు యాత్రలో భాగంగా సందర్శించారు. తిరిగి 2015లో ప్రాజెక్టుల సాధన పేరిట వైసీపీ ఎమ్మెల్యేలతో బస్సు యాత్ర నిర్వహించారు. ఇటీవల జలవనరుల శాఖామాత్యులు బాధ్యతలు స్వీకరించి, పోలవరాన్ని సందర్శించిన విషయం విదితమే.