telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్

cm jagan

ఏపీలో స్కూళ్లు తెరిచేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది. సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవుతాయని సీం వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్ సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్‍కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన్నారు.

Related posts