telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

విజయ్ మాల్యా .. వెయ్యి కోట్ల ఆస్తులు అమ్మేసుకోవచ్చు.. : కోర్టు

vijaymalya to india will become a dream

ఆర్థిక నేరస్తుడిగా పరిగణిస్తున్న విజయ్ మాల్యా ఆస్తుల అమ్మకానికి కోర్టు అనుమతి జారీచేసింది. మాల్యాకు చెందిన సుమారు వెయ్యి కోట్ల విలువైన షేర్లను అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌బీఐ బ్యాంకులకు మాల్యా వేల కోట్ల రుణాలను ఎగవేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బకాయిలను రికవర్ చేసే క్రమంలో తాజగా పీఎంఎల్ఏ కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.

యునైటెడ్ బ్రెవరీస్‌కు చెందిన షేర్లను అమ్మేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. మాల్యా ఆస్తుల అమ్మకంపై స్టే ఇచ్చే శక్తి కోర్టుకు లేదని స్పెషల్ జడ్జి ఎంఎస్ అజ్మీ తెలిపారు. బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మంగళవారం యునైటెడ్ బ్రెవరీస్ షేర్లు 2 శాతం పెరిగాయి. 74 లక్షల షేర్లను అమ్మితే సుమారు 999 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Related posts