telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

మొదటి సెమీఫైనల్ … వర్షార్పణం.. భారత్ ఫైనల్ సీటు ఖరారు..

rain may cancell india vs pak match today

నేడు ప్రపంచ కప్ లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల ధాటికి కివీస్ కుదేలయ్యింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(67), రాస్ టేలర్(67*) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.

న్యూజిలాండ్ బ్యాటింగ్ 46.1 ఓవర్లకు చేరుకునే సరికి.. అనుకోని అతిథిలా వరుణుడు రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. ప్రస్తుతం కివీస్ 46.1 ఓవర్లకు 211/5 పరుగులు చేసింది. అటు భారత్ బౌలర్లలో జడేజా, బుమ్రా, పాండ్యా, భువనేశ్వర్, చాహల్‌లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే భారత్ ఈ మ్యాచ్ లో గెలిచినా, లేక వర్షం కారణంగా మ్యాచ్ ఆగినా ఫైనల్ కి చేరడం ఖాయం అయిపోయింది.

Related posts