telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కృష్ణా జిల్లాలో రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

New couples attack SR Nagar

తమకు పరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులను కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. పవర్ గ్రిడ్ నిర్మాణ కోసం 2016లో ఈ ప్రాంత రైతులతో విద్యుత్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అయితే తాజాగా రైతుల పొలాల్లో విద్యుత్ అధికారులు చేపట్టారు.

పరిహారం చెల్లించకుండా అధికారులు పనులు చేపట్టడంతో.. రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా రెండు వారాలుగా అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. దీంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Related posts