telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

51వ రోజు రైతుల జల దీక్ష..సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు!

amaravathi ap

సేవ్‌ అమరావతి పేరుతో రైతులు చేపట్టిన దీక్ష 51వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా ఈరోజు రైతులు జల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సేవ్‌ అమరావతి, సేవ్‌ ఏపీ అంటూ నినాదాలు చేశారు.తాళ్లాయిపాలెం వద్ద కృష్ణా నదిలో నడుం లోతు నీటిలో మందడం రైతులు నిలబడి తమ నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అన్ని గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడాలని, రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

Related posts