భారత్ వైమానిక దాడులతో ఉగ్రవాదుల స్టావరాలను ధ్వంసం చేయడంతో అసూయతో రగిలిపోతున్న పాకిస్థానీలు.. భారత పైలట్ అనుకుని సొంత పైలట్నే చితకబాదారు. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను భారత వాయు సేనా పాక్ యుద్ధ విమానాలను వెంబడించి తరిమికొట్టాయి. పాక్ జరిపిన దాడిలో భారత్కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం పాక్లో కూలిపోయింది. భారత పైలట్ అభినందన్ పారాచూట్ సాయంతో సురక్షితంగా కిందికి దిగాడు. అలాగే కూలిన ఎఫ్-16 విమానం నుంచి పాక్ పైలట్ కూడా కిందికి దిగాడు. పాక్ భూభాగంలో అడుగుపెట్టిన అభినందన్ను బందీగా పట్టుకున్న పాక్ ప్రజలు విచక్షణారహితంగా దాడి చేశారు.
ఈ క్రమంలో తమ పైలట్ విషయంలోనూ పాకిస్థానీలు పొరపాటు పడ్డారు. తమ పైలట్ను భారత పైలట్గా భావించి చితకబాదారు. ఆయనపై రెచ్చిపోయి దాడిచేయడంతో పాక్ పైలట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పైలట్ను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం సైన్యానికి సమాచారం అందించారు. తొలుత అతడు భారత్ పైలట్ అని భ్రమపడిన సైన్యం కూడా ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించింది. అనంతరం అసలు విషయం తెలియడంతో ఒక్క భారత పైలట్ మాత్రమే తమ అదుపులో ఉన్నట్టు పాక్ ప్రకటించింది.
ఏపీ భవిష్యత్తు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది: సోమిరెడ్డి