తెలంగాణలో బీజేపీ శరవేగంగా బలపడటాన్ని సీఎం కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ కేసీఆర్ రాష్ట్రాన్ని పశ్చిమబెంగాల్ లా మార్చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్ నగర్ లో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన విజయ ఉత్సవ్ ర్యాలీపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు.
ఈ దాడిలో ప్రేమ్ కుమార్(23) అనే బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాలుగు సీట్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.