telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర మంత్రులకు కేటీఆర్‌ లేఖ.. కారణమిదే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పురపాలక శాఖ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర నిధుల కోసం మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు మరియు హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖను పంపారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్ నగర సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం నిధులను ఈ లేఖలో అడిగిన కేటీఆర్… వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. వరంగల్ నగరంలో రాష్ట్రప్రభుత్వం  ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్ట్ కి నిధులు కోరిన మంత్రి కేటీఆర్.. పురపాలక శాఖ ద్వారా పట్టణాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్, మానవ వ్యర్ధాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, బయో మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కోరిన కేటీఆర్… రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆమోదించడంతోపాటు కనీసం 20 శాతం నిధులను రానున్న కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts