సీఎం జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. విజయనగరం జిల్లా రామతీర్థం లో రాముడి విగ్రహం తల నరికిన తీసుకువెళ్లిన ఘటన చాలా దారుణమని…వైసీపీ ప్రభుత్వంలో ఈ ఘటన జరగడం దారుణమన్నారు. ఈ ఘటన జరగడం పై ముఖ్యమంత్రిగా మీకు సిగ్గు అనిపించడం లేదా అని జగన్ పై ఫైర్ అయ్యారు. జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకు వెళితే క్షణాల్లో పట్టుకుంటారని… హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నేరస్తులను పట్టుకోవడం లేదని మండిపడ్డారు రఘురామకృష్ణం రాజు. సీఎం గారు మీకు హిందువులంటే అంత చులకనా … హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని తక్షణం పట్టుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వండి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో వరుస సంఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని…ఇప్పటికైనా స్పందించి దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు.
previous post