telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు!

kalavenkat rao tdp

ఈనెల 21, 22 న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులపాటు జిల్లా కేంద్రంలో బస చేయనున్న చంద్రబాబు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీస్తారని తెలిపారు.

ఒక్కో నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి గత ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించనున్నారని వివరించారు.ఈ సందర్భంగా కళా వెంకటరావు అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా అధికార పార్టీ తీరు ఉందని విమర్శించారు. ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు.

Related posts