telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతి

laxmi parvathi ycp

వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతికి ఏపీ సర్కారు కీలక పదవి అప్పగించింది. లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీపార్వతి ఈ పదవికి న్యాయం చేస్తారని భావిస్తున్నారు. లక్ష్మీపార్వతి వైసీపీలో చేరిన తర్వాత సమయానుకూలంగా తన గళం వినిపిస్తూ పార్టీ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె శ్రమను గుర్తించి పార్టీ హైకమాండ్ ఈ పదవిని అప్పగించినట్టు తెలుస్తోంది.

Related posts