డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ వంటి సేవలను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా కాంటాక్ట్లెస్ సర్వీసులను అందజేయాలని నిర్ణయించింది. 18 సేవలను ఆన్లైన్నే పొందడానికి ప్రజలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ గురువారం ఓ నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రభుత్వ సేవల బట్వాడా ప్రక్రియలను సరళితరం చేస్తున్నట్లు ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది. 18 సేవలను ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, రెన్యూవల్ లాంటి సేవలను ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా ఆన్లైన్లోనే పొందవచ్చునని పేర్కొంది. ఈ కాంటాక్ట్లెస్ సేవలు అందరికీ అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.
శ్రీముఖి అంటేనే ఇష్టం… : రాహుల్ తల్లి సుధారాణి