telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..

KCR cm telangana

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ కార్మికుల సమ్మె, సచివాలయం కూల్చివేత వంటి అంశాలను ఈ భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు రెవిన్యూ చట్టంపై కసరత్తు చేసిన అనంతరం ముసాయిదాను రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మె నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Related posts