telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి: ఉత్తమ్ డిమాండ్

uttam congress mp

జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.గతంలో ఎన్టీఆర్ హయాంలో ఎలాంటి కమిషన్ వేయకుండానే గిరిజనులకు రిజర్వేషన్లు 5 నుంచి 6 శాతానికి పెంచారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో గిరిజనులు, ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని ఉత్తమ్ ఆరోపించారు.

ఎన్నికల ముందు ‘దళితుడే సీఎం’ అని చెప్పిన కేసీఆర్ తన క్యాబినెట్ లో ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. ముస్లింల రిజర్వేషన్ల అంశాన్ని టీఆర్ఎస్ పార్లమెంటులో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదని ఉత్తమ్ విమర్శించారు.

Related posts