telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

స్వచ్ఛమైన రాజకీయాలు చేశాం:  పవన్ కల్యాణ్

ఎన్నికల ఫలితాల పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎన్నికలు సక్రమ పద్ధతిలో జరగలేదని, ఇతర పార్టీల నేతలు కోట్ల రూపాయలను ఖర్చు చేశారని  పవన్ అన్నారు. సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు. 

కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు రూ. 150 కోట్లు దాటిందన్నారు. జనసేన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని,  స్వచ్ఛమైన రాజకీయాలు చేశామని తెలిపారు.నాలుగేళ్ల క్రితమే తాము పోటీ చేసి ఉంటే తమ బలం మరింత పెరిగేదని చెప్పారు. జనసేన కోసం యువతీయువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, అందుకే తమకు లక్షల ఓట్లు వచ్చాయని తెలిపారు.

Related posts