వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునుద్దేశించి తనదైన శైలిలో విమర్శలు చేశారు. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు, అతడి బృందం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు.
పార్టీ పగ్గాలు లాక్కుని ఎన్టీఆర్ గారిని చంద్రబాబు అవమానించారని వెల్లడించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ గారి మీద సస్పెన్షన్ ఎత్తివేస్తారేమో చూడాలి అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.