*నెల్లూరులో ఇంటికి చేరుకున్న గౌతమ్రెడ్డి బౌతికకాయం ..
*రేపు ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
*గౌతమ్రెడ్డి భౌతికకాయం చూసేందుకు భారీగా తరలి వస్తున్న అభిమానులు
*నెల్లూరులోగౌతమ్ ఇంటికి తరలివస్తున్న అభిమానులు..
*తమ అభిమాన నేతకు కడసారి నివాళి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి భౌతిక కాయం నెల్లూరుకు చేరుకొంది. హైద్రాబాద్ భేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని తరలించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి రోడ్డు మార్గం ద్వారా మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి పార్ధీవ దేహన్ని తరలించారు.
తమ అభిమాన నేత గౌతం రెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు ఉదయం వరకు మేకపాటి గౌతం రెడ్డి ఇంట్లోనే ఆయన పార్ధీవ దేహన్ని ఉంచనున్నారు. గౌతం రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఇవాళ రాత్రికి అమెరికా నుండి నెల్లూరుకు చేరుకొంటారు.
రేపు బుధవారం ఉదయం 11గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు మంత్రులు రేపు నెల్లూరు రానున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు కూడా నెల్లూరుకు చేరుకొన్నారు.