telugu navyamedia
సినిమా వార్తలు

భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల..ఫ్యాన్స్ కు పండుగే

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ వచ్చేసింది. టైటిల్‌ పాత్రలో పవర్ స్టార్, డేనియల్ శేఖర్​గా పాత్రలో రానా దగ్గుబాటి పోటాపోటీగా నటించారు.

ఇందులో ప‌వన్‌కు జోడిగా నిత్యా మీనన్‌ కనిపిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తోంది.

ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. తాజాగా ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏంటి బాలీజీ స్పీడ్ పెంచావు అన్న డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది..ఇది పులులు తిరిగే ప్రాంతం అంట‌ బాబు ..అంటే పులి పెగ్గేసుకుని ప‌డుకుంది అన్న డైలాగ్ అదిరింది.

నిత్యా మీనన్, మురళీ శర్మ డైలాగ్స్ కూడా పవన్ కు ఎలివేషన్ గా నిలిచాయి.నాయ‌క్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్క‌డా రాణా డైలాగ్ బాగుంది..

మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం కి రీమేక్ గా తెరకెక్కించనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించ‌గా సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.

Related posts