telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

 జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త అరెస్ట్

jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ టీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త రాజేశ్ నాయుడు మే 28న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన వైసీపీ నేత నరసింహారెడ్డి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఐపీసీ సెక్షన్ 506, ఐటీ చట్టం కింద రాజేశ్ పై కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయన్ను ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు. ఏప్రిల్ 11న ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమపై రాజేశ్ దాడి చేసినట్లు గతంలోనే వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts