ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది సోమవారం ఉదయం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాసేపట్లో జిల్లావారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కలెక్టర్లకు సీఈవో ఆదేశించారు.
నేటి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నామినేషన్ల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 27 నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ అనంతరం మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.