telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తప్పుగా మాట్లాడానని బొత్స ఒప్పుకోవాలి: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

ఏపీ రాజధానిపై తప్పుగా మాట్లాడానని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒప్పుకోవాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని దేశ పటంలో కూడా లేకుండా చేశారని మంత్రి చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. అమరావతిలో ఎన్ని భవన నిర్మాణాలున్నాయో బొత్సకు చూపిస్తానని అన్నారు.

12 టవర్లతో 288 క్వార్టర్ల నిర్మాణాలున్నాయని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని వ్యాఖ్యానించారు. బొత్స అవస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. అమరావతి పేరు చెబితే చంద్రబాబు నాయుడే ప్రజలకు గుర్తొస్తారని వైసీపీ నేతలకు తెలుసని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. పేదలకు తాము 5 వేల గృహాలు నిర్మిస్తే, బొత్స మాత్రం నిర్మించలేదంటున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Related posts