టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు ఈ రోజు వైసీపీలో చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. మస్తాన్రావుకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
మస్తాన్రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో బీద మస్తాన్రావు ఆ పార్టీని వీడినట్లు తెలుస్తోంది.
నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారు: పవన్