telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారు: పవన్

ఎన్నికల్లో తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఒక్క వీరవాసరం మండలంలోనే రూ.30 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసిందని అన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితిపై ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాయలసీమ ప్రాంత నేతలతో సమావేశమైన పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీ సీట్లు గెలవకపోయినా, స్వచ్ఛమైన రాజకీయాలతో ప్రజల మనసులు గెలుచుకుందన్నారు. నేను ఓడిపోయానని అనుకోవడంలేదు. నాకు వచ్చిన ప్రతి ఓటు వంద కోట్ల రూపాయలకు సమానమని పవన్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో ఏకీభవించే ప్రసక్తేలేదన్నారు. ఇప్పటివరకు తన ఆశయాలనే చూశారని, ఇకపై తన రాజకీయాలు కూడా చూస్తారని ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు.

Related posts